అక్షరశక్తి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరగా నిరవేర్చడానికి తమ ముందు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూంది అనే చెప్పాలీ. అందులో బాగంగానే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్ధీప్ సింగ్ పూరీ ని కలుసుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న “మహాలక్ష్మి” సంక్షేమ పథకం గురించి వివరించారు. గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో సీఎంగారి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రివర్యులు ఉత్తం కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.