అక్షరశక్తి, ధర్మసాగర్: కరుణాపురం, రాంపూర్ మద్యగల ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న అన్నాచెల్లెలు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులు హసన్ పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన సుమిత్ రెడ్డి, పూజిత రెడ్డిలుగా గుర్తింపు పోలీసులు గుర్తించారు. మృతదేహలను ఎంజీఎం మార్చురీకి ధర్మసాగర్ పోలీసులు తరలించారు.