Monday, September 16, 2024

చోరికి గురైన 11 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.

Must Read

అక్ష‌ర‌శ‌క్తి ఏటూరు నాగారం: జిల్లాలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి మొబైల్ ఫోన్ల రికవరీ కోసం ములుగు జిల్లాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందని ఏ ఎస్పీ శ్రీ శివమ్ ఉపాధ్యాయ ఐపిఎస్ అన్నారు. గత సంవత్సరం పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని, ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సిఇఐఆర్ పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు బ్లాక్ చేసి, సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వ‌ర‌గా పట్టుకోవడానికి సిఇఐఆర్ ఎంతో ఉపయోగపడుతుంది. సిఇఐఆర్ వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఇఐఆర్ ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత స‌మాచారాన్ని కాజేస్తారు అన్నారు. ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా ఐఎంఇఐ నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని దానిద్వారా ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు. అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు. ములుగు జిల్లా లోని ప‌లు మండ‌లాల‌ల్లో రిక‌వ‌రీ అయిన 11 ఫోన్ న్ల‌ను బాదితుల‌కు అందించారు. ప్రతిభ కనబరిచిన ఏటుర్ నాగారం కానిస్టేబుల్ హరీష్, శ్రీనివాసులను ఏ ఎస్పీ శివమ్ ఉపాధ్యాయ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై ఎస్ కే తాజుద్దీన్, బాధితులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img