ఆమె వ్యాఖ్యలకు నేనెలా బాధ్యత వహిస్తా

*ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం *క్రమశిక్షణ కమిటీ నోటీసుపై కొండా సురేఖ వివరణ   అక్షరశక్తి హైదరాబాద్: తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఆమె తన వివరణను సమర్పించారు. ఆగస్టు 19న తన జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కొండా కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, జన్మదిన వేడుకలు నిర్వహించారని...