బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో ఉంచుకుని ప‌నిచేయాలి సోషల్‌ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మొద్దు టీడీఎంయూ లోగో ఆవిష్క‌ర‌ణ‌లో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ శ్వేత అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే వార్తలను ప్రజల ముందుకు తీసుకురావాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత అన్నారు. వార్త కంటే వాస్తవం ముఖ్యం. సంచలనం కంటే ప్రజా ప్రయోజనం ముఖ్యమ‌ని అన్నారు. మంగ‌ళ‌వారం తెలంగాణ డిజిట‌ల్ మీడియా యూనియ‌న్ అధికారిక లోగోను క‌మిష‌న‌ర్ శ్వేత...