Sunday, September 8, 2024

వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకి కొత్త భవనాన్ని నిర్మించాలి

Must Read

• వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కొత్త భవనాన్ని నిర్మించాలి

• ప్రభుత్వం వెంటనే నిర్మాణానికి కావాల్సిన బడ్జెట్ కేటాయించాలి

అక్ష‌ర‌శ‌క్తి. వ‌రంగ‌ల్ : ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకి కొత్త భవనాన్ని వెంటనే నిర్మించాలని, శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్ వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఏఐడీఎస్ఓ విద్యార్ధి సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎ. సత్యనారాయణ అన్నారు. భవన నిర్మాణం కోసం కావాల్సిన రూ25 కోట్లను తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఎ. సత్యనారాయణ, రాష్ట్ర సభ్యులు సురేష్, వెంకటేష్ ల‌ను పోలీసులు అరెస్ట్ చేసి మట్వాడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు అయాన్, ఆదిత్య, ఎబెనెజర్, దినేష్, వసంత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img