Sunday, September 8, 2024

కొత్త త‌ర‌హా మోసం- ఎ.టి.ఎం కి వెలితే జాగ్ర‌త్త‌..

Must Read

అక్షర‌శ‌క్తి వ‌రంగ‌ల్: పెరుగుతున్న ఆధునికతకు  అనుగుణంగా  అన్నీ మారుతూ వ‌స్తున్నాయి. ఆదేవిధంగా  దొంగ‌లు కూడా మారుతున్నారు. రోజు రోజుకి దొంగ‌లు వాళ్ళ క్రియేటివిటీని చుపుతున్నారు. అలాంటి ఒక కొత్త ప‌ద్ద‌తిని ప్ర‌ద‌ర్శించారు కాని వాళ్ల లాగే పోలీసులు కూడా అప్డేట్ అయ్యారు అని గ్ర‌హించ‌లేక‌పోయారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుండి శుభం అనే వ్య‌క్తీ అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్ తో క‌ల‌సీ వ‌రంగ‌ల్ కి వ‌చ్చి, ఒ బట్టల షాపులో ప‌నిచేసుకుంటున్నాడు. వాళ్లకు వ‌చే జీతం స‌రిపొక‌పోవ‌డంతో శుభం, అతని గర్ల్ ఫ్రెండ్ జకోసం ఏటీఎంలో డబ్బులు వచ్చే దగ్గర ప్లాస్టిక్ పట్టీని పెట్టి ఫేవిక్విక్ తో అంటించి వెళ్లేవారు.. డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వచ్చిన వారు డబ్బులు రాకపోవడంతో తిరిగి వెళ్ళిపోయేవారు.

ఇలా వాళ్లు వెళ్లాక డబ్బులు తీసుకొని శుభం జల్సాలు చేసేవాడు. దీని గురించి అడిగి తెలుసుకున్న మరికొంత మంది మైనర్లు ఇలా ఏటీఎం చోరీలు చేశారు.. ఈ తరహా సంఘటనలు బ్యాంక్ అధికారులకు ఎక్కువ ఫిర్యాదులు రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ముగ్గురిని అరెస్ట్ చేయగా, అసలు దొంగ శుభం అతని గర్ల్ ఫ్రెండ్ పరారీలో ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img