Sunday, September 8, 2024

బొగ‌త జ‌ల‌పాతంలో యువ‌కుడు మృతి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి ములుగు జిల్లా: కొద్ది రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌కు రాష్ట్రం అంతా నీటిమ‌యం అయింది. జ‌ల‌పాతాలు అన్ని కూడా అస‌లు రూపాన్ని సంత‌రించుకున్నాయి. ఆ అంద‌మైన దృశ్యాల‌ను చుసేందుకూ సంద‌ర్శ‌కులు భ‌రీగా త‌ర‌లి వ‌స్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగ‌త జ‌ల‌పాతాన్ని చూసేందుకు వ‌రంగ‌ల్ జిల్లా ఏనుముల మార్కెట్ సుంద‌ర‌య్య న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన బొన‌గాని జ‌స్వంత్ (19) అనే యువ‌కుడు తోటి మిత్రులైన సాయికిర‌ణ్, ప్ర‌శాంత్ నాగేంద‌ర్ లతో క‌లిసీ వెళ్లారు. కొద్ది స‌మ‌యం త‌రువాత స్నానాలు చెసేందుకు నీటిలోకి దిగారు. నీటి ప్ర‌వాహం అధికంగా ఉండ‌టంతో జ‌ల‌పాతం లోకి కొట్టుకు పోయాడు. ఎంతసేప‌టికి పైకి రాక‌పోవ‌డంతో అక్క‌డ ఉన్న అధికారుల‌కు స‌మాచారం అందించారు. విశయం తెలుసుకున్న అధికారులు గ‌జ ఈత‌గాళ్ల‌తో వెతికించి సాయంత్రానికి మృతదేహాన్ని బ‌య‌టికి తీయించారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img