Monday, September 16, 2024

నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవు – ఏసిపి కే దేవేందర్ రెడ్డి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: వ‌రంగ‌ల్ మహానగరంలో నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని నిందితులు ఎంత వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని .. హనుమకొండ ఏసీపీ కే .దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండలోని వాజ్ పాయ్ కాలనీలో ముగ్గురు ఇన్స్పెక్టర్ లు సుబేదారి సిఐ, హనుమకొండ సిఐ, కే యు సి ఐ, లతో కలసి సైబర్ క్రైమ్, మైనర్ బాలురు వాహనాలు నడపటం, నేరాలు, అసంఘిక కార్యకలాపాలు డ్రగ్స్, గంజాయి ఇతర నేరాలు జరుగుతున్నాయి. ఎవరైనా అనుమానితుల పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చని, స్థానిక కాలనీవాసులకు అవగాహన కల్పించి, కాల‌నీ లో కార్డెన్ సెర్చ్ నిర్వహించి, పత్రాలు లేని 15 టూ వీలర్స్, 2 ఆటోలని సీజ్ చేయడం జరిగింది. ఎవరైనా అనుమానం కలగే విధంగ ఉన్నట్లు గుర్తించినట్లయితే పోలీసుల‌కు తెలియ‌జేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సుబేదారి ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ రెడ్డి, హన్మకొండ ఇన్స్పెక్టర్ వై సతీష్, యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ సంజీవ్ మరియు 10మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img