అక్షరశక్తి, భూపాలపల్లి : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విజయభేరి బస్సు భూపాలపల్లి జిల్లాలో రెండో రోజు కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా పార్టీ అగ్రనేతలు రాహుల్గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితోపాటు భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు, మంథని నేత దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రాహుల్గాంధీ సింగరేణి కార్మికులతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.