అక్షరశక్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలో మరో దారుణ ఘటన జరిగింది. టీఆర్ ఎస్ యూత్ నాయకుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్యకు యత్నించడం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన టీఆర్ ఎస్ యూత్ లీడర్ బోగ రవిచంద్ర ఈరోజు ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం పట్టణంలోని శంకరన్న కాలనీకి వెళ్తుండగా కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. సీసాలతో పొడవగా తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.