అక్షరశక్తి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్ నిమ్మకాయలు ఇస్తున్నారని, ఎమ్మెల్యేలూ జాగ్రత్తగా ఉండండి అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇతరుల నాశనం కోరుకుంటున్నారన్నారు. డబ్బులతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారన్నారు. కాంగ్రెస్లో కులాల కొట్లాటను కేసీఆరే పెట్టిస్తున్నారని ఆరోపించారు. అక్కడ ఎవరు గెలిచినా కేసీఆర్ దగ్గరికే వెళ్తారని అన్నారు. కేసీఆర్ను యువత క్షమించదని బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు.