ములుగు : టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కాన్వాయ్ను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు రేవంత్ కారులో బయలుదేరారు. మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మార్గంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ముందుగా రేవంత్ రెడ్డి వాహనంతోపాటు ఎనిమిది వాహనాలకు అనుమతి ఇచ్చారు. మిగిలిన వాహనాలను వేరే మార్గానికి మళ్లించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈక్రమంలో మేడారం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Must Read