Saturday, July 27, 2024

బీజేపీ తొలి జాబితా విడుద‌ల‌..

Must Read

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో వారికే అవ‌కాశం..
అక్ష‌ర‌శ‌క్తి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఎట్ట‌కేల‌కు విడుదలైంది. రెండు రోజులుగా ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. మొత్తం 52 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను బీజేపీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. అక్టోబర్ 20న జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సారధ్యంలోని భేటీ అయిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మీటింగ్‌కు ప్రధాని మోదీ, మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో ఈ 52 మంది అభ్యర్థుల పేర్లకు కమిటీ ఆమోదం తెలిపింది.


ఈ మొద‌టి జాబితాలో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నుంచి రావు ప‌ద్మ‌, వ‌రంగ‌ల్ తూర్పు నుంచి ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్‌రావు, వ‌ర్ధ‌న్న‌పేట నుంచి కొండేటి శ్రీ‌ధ‌ర్‌, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నుంచి గుండె విజ‌య‌రామారావు, భూపాల‌ప‌ల్లి నుంచి చందుప‌ట్ల‌ కీర్తిరెడ్డి, జ‌న‌గామ నుంచి ద‌శ‌మంత్‌రెడ్డి, పాల‌కుర్తి నుంచి రామ్మోహ‌న్‌రెడ్డి, మ‌హ‌బూబాబాద్ నుంచి హుస్సేన్‌నాయ‌క్‌, డోర్న‌క‌ల్ నుంచి భూక్య సంగీత చోటు ద‌క్కింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img