Saturday, September 7, 2024

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ద‌హ‌నం

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు, విద్యారంగానికి నిధులు కేటాయించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేయూ సుబేదారి ఆర్ట్స్ కళాశాల ముందు వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ద‌హ‌నం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ మాట్లాడుతూ… బడ్జెట్ ను సవరించి, విద్యా అభివృద్ధికి ప్రభుత్వ రంగంలో ఉన్నత విద్య అభివృద్ధి కోసం చర్యలు తీసుకొని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బిరెడ్డి జస్వంత్, సహాయ కార్యదర్శి అనూష, జిల్లా కమిటీ సభ్యులు అబ్బగొని అరుణ్ కుమార్, నాయకులు సాయి అభిషేక్, సృజన్, రాహుల్ త‌దిత‌రులు పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img