దేశంలో కరోనా వైరస్ మళ్లీ రెచ్చిపోతోంది. రోజుకు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఖర్గే నమూనాలను బుధవారం అర్టీ- పీసీఆర్ పరీక్ష కోసం పంపగా పాజిటివ్ గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, హోం ఐసోలేషన్లో ఉన్నట్లు ఖర్గే కార్యదర్శి రవీంద్ర తెలిపారు.