Sunday, September 8, 2024

అన్ని వర్గాల అభివృద్దే బీజేపీ లక్ష్యం

Must Read
  • కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే…
  • ప‌ర‌కాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్ష‌ప‌తి

అక్షరశక్తి, నడికూడ: దేశంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని పరకాల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత‌ మొలుగూరి భిక్షపతి అన్నారు. ఇటీవ‌ల బీజేపీలో చేరిన ప్ర‌ముఖ వైద్యుడు డాక్టర్ కాళీ ప్రసాద్ గురువారం పరకాల నియోజకవర్గంలోని నడికూడ మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో మొదట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజ అనంతరం మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తి మాట్లాడుతూ తెలంగాణ సోదరీమణులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం రావాలని అన్నారు. ఖమ్మంలో జరిగిన భారీ సభలో పరకాల నియోజకవర్గంలోని ఇతర పార్టీ నాయకులు 2500 మంది బిజెపిలో చేరార‌ని అన్నారు. డాక్టర్ కాళి ప్రసాద్ చేరడంతో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారని, కాంగ్రెస్ టికెట్లు సంపాదించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ లీడర్లకు డబ్బులు ఇస్తున్నాడని అన్నారు.

  • బీజేపీ జెండా ఎగ‌రేద్దాం : డాక్ట‌ర్ కాళీప్ర‌సాద్
    వెంకటేశ్వర పల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయస్వామి ఆశీస్సులు తీసుకున్న అనంతరం గ్రామానికి చెందిన ఆడబిడ్డ కొనుగాటి అక్షిత బిజెపి నాయకులు డాక్టర్ కాళీ ప్రసాద్ కు రక్ష కట్టి ఆశీస్సులు అందజేశారు. రాఖీ కట్టిన ఆడబిడ్డకు రాఖీ కానుకగా పై చదువులు ఉచితంగా చదివిస్తానని అభినందనలు తెలిపారు. వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోపాటు వెంకటేశ్వర పల్లి గ్రామ ప్రజల ఆశీస్సుల కోసం ఈ గ్రామానికి వచ్చానని, ఈ గ్రామం స్వచ్ఛమైన మనసుతో ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికలలో బిజెపి పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని అన్నారు. ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో బిజెపి పార్టీలో చేరానని, ఒక సైనికుని వలె బిజెపిలో ఉండి నిబద్ధతతో పరకాలలో బిజెపి జెండా ఎగర వేస్తాం అని అన్నారు. వెంకటేశ్వర్ పల్లి గ్రామంలో డాక్టర్ కాళీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు 30 మంది బిజెపి పార్టీలో చేరడంతో వారికి బిజెపి శాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పి జయంత్ లాల్, వరంగల్ జిల్లా కోశాధికారి పగడాల రాజకుమార్, బీజేవైఎం జిల్లా సెక్రెటరీ ఎరుకల దివాకర్, కంటత్మకూర్ ఎంపీటీసీ గుండెబోయిన రాజు, నడికుడ మండల అధ్యక్షుడు గోగుల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గోనెల కోటేశ్వర్, దండు సురేష్, పరకాల పట్టణ అధ్యక్షుడు మార్త భిక్షపతి, ఆకుల రాంబాబు, నాయకులు మేకల రాజవీరు, దుబాసి వెంకటస్వామి , పాలకుర్తి తిరుపతి, చనుమల సాంబ రెడ్డి, మాజీ సర్పంచ్ మారబోయిన శివకుమార్, పర్నం రవీందర్ రెడ్డి, బండారి కృష్ణ, బొచ్చు వరప్రసాద్, పున్నం అశోక్, బిజెపి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img