Saturday, September 7, 2024

నకిలీ సర్టిఫికెట్లు విక్ర‌యిస్తున్న‌ ముఠా అరెస్ట్

Must Read
  • 153 న‌కీలీ స‌ర్టిఫికెట్లు, 7 ర‌బ్బ‌ర్ స్టాంపులు, 3 కంప్యూట‌ర్లు, ఒక ల్యాప్ టాప్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం
    అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ ల నుండీ పరీక్షల్లో విధ్యార్థుల అవసరాలను అసరాగా చేసుకోని దేశంలోని వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించి ఇంటర్, డిగ్రీ, పీజి, బీటెక్, చార్టెడ్ అకౌంటెంట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్లను విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేయ‌గా మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. వీరి నుండి పోలీసులు వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన 153 నకిలీ సర్టిఫికేట్లు, 7 రబ్బరు స్టాంపులు, మూడు కంప్యూటర్లు, ఒక ల్యాప్ టాప్, మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. హన్మకొండ కి చెందిన నారెడ్ల రమేష్, దేవరాజు సుధాకర్, దాస బిక్షామయ్య అనే ముగ్గురు వేరు వేరుగా ఎడ్యుకేషనల్ అకాడమీలను ఏర్పాటు చేశారు. యువకుల అవసరాలను అసరాలను అసరగా చేసుకుని ఎలాంటి పరీక్షలు రాయకుండానే దేశంలో వివిధ విశ్వవిధ్యాలయాలకు చెందిన యాజమాన్యంతో నిందితులు చేతులు కలిపి కావల్సినవారికి ఇంటర్, డిగ్రీ, పీజి, బీటెక్, చార్టెడ్ అకౌంటెంట్ సంబంధించి నకిలీ ఉత్తీర్ణత సర్టిఫికెట్లను ఒక లక్ష రూపాయల నుండి మూడు లక్షల రూపాయలకు విధ్యార్థులకు అందజేసేవారు.  అంతే కాకుండా దేశాలలోని ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు వీలుగా మార్కుల మెమో లను సవరించి మార్కుల శాతాన్ని పెంచుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు ముగ్గురుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దేశం లోని ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహర్రా, హిమాచల ప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల ప్రదేశ్, గుజరాత్, పంజాబ్, సిక్కిం, జార్కండ్, ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సూమారు ముప్పైకి పైగా విశ్య విద్యాల‌యాల‌కు చెందిన నకిలీ సర్టిఫికేట్లను అందజేయడం జరిగింద‌ని ఇందులో 1. స్వామీ వివేకానంద యూనివర్సిటీ, మధ్య ప్రదేశ్, 2. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్- ఉత్తరప్రదేశ్, 3. హిమాలయ యూనివర్సిటీ – హిమాచల ప్రదేశ్, 4. మహాత్మా గాంధి కాశీ విద్యపత్ యూనివర్సిటీ- మహారాష్ట్ర, 5. ఐఐఈ యూనివర్సిటీ- ఢిల్లీ, 6. గీతం- వైజాగ్, 7. నెఫ్ట్అరుణాచ‌ల్‌ ప్రదేశ్, 8. ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్- ఆంధ్ర ప్రదేశ్ కు విశ్వ విద్యాలయాలు ఉన్నాయని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు సంతోష్, శ్రీనివాస్ జీ, ఎస్సై లవన్ కుమార్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ సోమలింగం, కానిస్టేబుళ్లు రాజేష్, అలీ, బిక్షపతి, శ్రీను, రాజు, శ్రవణ్ కుమార్ ల‌ను సీపీ అభినందించారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img