Sunday, September 8, 2024

కదిరే కృష్ణకు ముంబై ఓబీసీ, ఎస్సీల సంపూర్ణ మద్దతు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : హైకోర్టు న్యాయవాది, మహామేధావి, బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కదిరె కృష్ణను అసభ్యకరంగా మాట్లాడిన చికోటి ప్రవీణపై తెలంగాణ ప్ర‌భుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలని ముంబైకర్లు డిమాండ్ చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ “సుప్రభాతం”ను సంస్కృతం నుంచి తెలుగు భాషలో అనువాదం చేసి మాట్లాడిన దానిని దురుద్దేశంతో ఎడిట్ చేసిన చికోటి ప్రవీణ్ అనే బీజేపీ వ్యక్తి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. అదేగాకుండా హిందుధర్మ రక్షకులమని, కృష్ణను నరికేస్తామని, బెదిరింపులకు పాల్పడుతున్న చీకోటిపై హత్యాయత్నం కేసుచేసి తక్షణమే అరెస్టు చేయాలని ముంబై ఎస్సి, ఓబీసీలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముంబైకర్లు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికి విశ్లేషించే హక్కు, భావస్వేచ్చ హక్కు వుందని, దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే తాము ఉరుకోబోమంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో తమ ముక్తిదాతలైన జ్యోతిబా ఫూలే, అంబేడ్కర్ల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే త‌మ‌ మనోభావాలు దెబ్బతినయా? అని ప్ర‌శ్నించారు. శనివారం దాదర్లో ముంబై తెలంగాణ బహుజన ఫోరం (ఎంటీబిఎఫ్) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తపర్చారు. ఇందులో ఎంటీబిఎఫ్ కన్వీనర్లు ఎల్ది రఘునాథ్ పద్మశాలి, కాషవేని చంద్రన్న గంగపుత్ర, నారపాక లక్ష్మణ్ మహారాజ్, జీ.నర్సయ్య గంగపుత్ర, పి.రాజేష్ గంగపుత్ర, మూల్ నివాసి మాలజీ ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img