Saturday, September 7, 2024

వరంగల్ కమిషనరేట్ పోలీసులకు ఉత్తమ ప్రతిభా పురస్కారాలు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ స్టేషన్లలో వర్టికల్ విధానంలో తమకు అప్పగించిన విధుల్లో రాణిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులకు రాష్ట్ర పోలీస్ డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం పురస్కారాలను అందజేసారు. హైదరాబాద్ డీజీపీ కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో రాష్ట్ర వ్యాప్తంగా వర్టికల్స్ విధానంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు వర్టికల్స్ వారిగా ప్రతిభా పురస్కారాలను అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2021 సంవత్సరానకి గాను వర్టికల్స్ విధానంలో ప్రతిభ కనబరిచిన గీసుగొండ ఇన్ స్పెక్టర్ రాయల వేంకటేశ్వర్లు, మట్టెవాడ ట్రాఫిక్ ఎస్.ఐ యం.డి ఫసీయుద్దీన్, కానిస్టేబుల్ డి.గోవర్ధన్(మడికొండ), ఎన్.సురేందర్(ఎల్కతుర్తి), టి.శ్రీనివాస్ రావు(మామూనూరి), కె.అనిల్ కుమార్ (జనగాం), డి.ప్రతాప్ (మీకాలనీ), ఆర్.మల్లేషం(ఖానాపూర్), బి. భౌసింగ్ (మహిళా పోలీస్ స్టేషని), వి. అనిల్ (సుబేదారి), జి.మోహన్ (ట్రాఫిక్ వరంగల్),ఎల్.రాజు (మామూనూరి)లకు డీజీపీ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలను అందజేసారు. ఈ సందర్భంగా ప్రతిభ పురసార్కాలను అందుకున్న పోలీస్ అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషితో పాటు, డిసిపిలు అభినందనలు తెలియజేసారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img