Sunday, September 8, 2024

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌… ప‌దో త‌ర‌గ‌తితోనే ప్ర‌భుత్వ కొలువు

Must Read

పోస్టల్​శాఖలో 40,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్​
నిరుద్యోగుల‌కు మ‌రో శుభవార్త‌. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌‌‌‌ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌‌‌‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ విడుద‌లైంది. పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగానే ఈ నియామకాలు చేపట్ట‌నున్నారు. ఎంపికైనవారు బ్రాంచ్‌‌‌‌ పోస్టు మాస్టర్‌‌‌ (బీపీఎం), అసిస్టెంట్‌‌‌‌బ్రాంచ్‌‌‌‌ పోస్టు మాస్టర్‌‌‌ (ఏబీపీఎం), డాక్‌‌‌‌ సేవక్‌‌‌‌ హోదాలతో విధులు నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మ్యాథ్స్‌‌‌‌, ఇంగ్లిష్‌‌‌‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌‌‌‌ తొక్కడం వచ్చి ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి. నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 – రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470 వేతనం ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌‌‌‌ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్‌‌‌‌డ్‌‌‌‌/ అన్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌డ్‌‌‌‌ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌‌‌‌ఉమెన్‌‌‌‌లకు ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. పూర్తి వివరాలకు www.indiapostgdsonline.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img