Thursday, September 19, 2024

కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి – ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ:కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే, కుడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణలతో కలిసి జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులను నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలో ఉన్న కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఆయా పనులను గురించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, త్వరగా అన్ని పనులు పూర్తి చేయాలని అన్నారు. నిబంధనల మేరకు నిర్మాణ పనులు ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

కాళోజీ కళాక్షేత్రం మొత్తం తిరిగి జరుగుతున్న పనులను చూసి, ఏ ఏ పను లు అసంపూర్తిగా ఉన్నాయో వాటిని వెంటనే పూర్తి చేయాలి అన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కళావేదిక నిర్మాణం, వేదికపై వేటిని ఏర్పాటు చేయాలి, ఎలాంటి పరికరాలు అమర్చాలనే విషయాలపై అధికారులకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జి డబ్ల్యూ సిఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, కూడా పీవో అభిజిత్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img