Friday, July 26, 2024

అల్లం బాలిరెడ్డిని అభినందించిన కేటీఆర్‌

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, గీసుగొండ : వ‌రంగ‌ల్ జిల్లా గీసుగొండ మండ‌లం మరియపురం గ్రామ సర్పంచ్ అల్లం బాల్‌రెడ్డిని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అభినందించారు. గ్రామాభివృద్ధికి స‌ర్పంచ్‌గా బాల్‌రెడ్డి చేస్తున్న సేవ‌ల‌ను కొనియాడారు. జాతీయ ఆద‌ర్శ‌గ్రామంగా మ‌రియ‌పురం ఎంపికైన సంద‌ర్భంగా సర్పంచ్ అల్లం బాల్‌రెడ్డి హైద‌రాబాద్‌లో కేటీఆర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈసంద‌ర్భంగా స‌ర్పంచ్‌తోపాటు పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి స్వప్నను మంత్రులు కేటీఆర్‌, ద‌యాక‌ర్‌రావు శాలువాతో స‌న్మానించారు.

ఈసంద‌ర్భంగా మ‌రియ‌పురం గ్రామంలో చేప‌డుతున్న అభివృద్ధి ప‌నుల‌ను కేటీఆర్ స‌ర్పంచ్‌ను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని, మ‌రియ‌పురం గ్రామం భ‌విష్య‌త్‌లో మ‌రింత అభివృద్ధి సాధించాల‌ని కేటీఆర్ ఆకాంక్షించారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img