అక్షరశక్తి, హన్మకొండ : హన్మకొండ కలెక్టరేట్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన లేబర్ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబును తెలంగాణ ఉద్యమకారుడు, భారత రాష్ట్ర సమితి హన్మకొండ జిల్లా సీనియర్ నాయకుడు, సమ్మన్వయ సభ్యుడు బస్కే రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిసారు. పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎస్సీ సెల్ కడిపికొండ అధ్యక్షుడు ఇమ్మడి వీరాస్వామి, బొజ్జ కుమార్, మధు, శంకరంమూర్తి తదితరులు పాల్గొన్నారు.