Sunday, September 8, 2024

నాబిడ్డ‌ను హ‌త్య చేసిండ్రు.. ప్రీతి తండ్రి సంచ‌ల‌న ఆరోప‌ణ‌

Must Read

స్వ‌గ్రామానికి మెడికో మృత‌దేహం.. మిన్నంటిన రోదన‌లు
అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : మెడికల్ స్టూడెంట్ ప్రీతి మృతితో జనగామ జిల్లా గిర్నితండాలో విషాదచ్ఛాయ‌లు అలుముకున్నాయి. హైదరాబాద్ నుండి భారీ భద్రత నుడుమ ప్రీతి మృతదేహాన్ని సోమ‌వారం ఉదయం గిర్నీతండాకు తరలించారు. ప్రీతి మృత‌దేహాన్ని చూసిన కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నా రు. కాగా, తమ బిడ్డను హత్య చేశారని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రీతికి సైఫే హానికరమైన ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడని ఆమె తండ్రి నరేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు చావుకు కారణమైన అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. దేనినైనా ఎదురిస్తుందని అన్నారు. ప్రీతి నాకు ఫోన్ చేసి నన్ను ఎవరైనా ఏదైనా చేస్తారనే భయం వుందని చెప్పింది. అలా చెప్పిన కొద్దిసేపటికే ఇలా జరిగిందని అన్నారు. దీనికి కారణం అయిన సైఫ్‌ను ఉరి తీయాలని ప్రీతి తండ్రి డిమాండ్ చేశారు. ప్రీతిని సైఫ్ కావాలనే హత్య చేశాడు.. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు పంపానని ఆయ‌న పేర్కొన్నారు.
స్వగ్రామంలో భారీ బందోబస్తు
కాగా ఎంజీఎం నుంచి నిమ్స్ వరకు ప్రతీది డ్రామానే క్రియేట్ చేశారని త‌ల్లిదండ్రులు, బంధువులు మండిపడుతున్నారు. మ‌రోప‌క్క ప్రీతి మృతి కారణమైన సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని గిరిజన, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 90 రోజులలోపు నిందితుడికి శిక్ష విధించాలని కోరుతున్నాయి. బాధిత కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాయి. ఆందోళనల నేపథ్యంలో ప్రీతి స్వగ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా ప్రీతి అంత్యక్రియలు ఇయ్యాళ మధ్యాహ్నం గిర్నితండాలో జరగనున్నాయి.
ప్రీతి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా..
ప్రీతి మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది. మొదట రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. అయితే నిమ్స్ వద్ద ప్రీతి కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. దీనితో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు నేరుగా ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి కీలక హామీలిచ్చారు. రూ.30 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఒకరికి పంచాయతీ రాజ్ శాఖలో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. అలాగే ప్రీతి మృతిపై ఫాస్ట్రాక్ కోర్టుతో విచారణ జరిపిస్తామని మంత్రులు హామీనిచ్చారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అలాగే ప్రీతి మృతిపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.
కాసేపట్లో అంత్యక్రియలు..
కాగా నేడు మొండ్రాయిలోని గిర్నీతండాలో ప్రీతి అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. ప్రీతి అంత్యక్రియల్లో అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రీతి మృతితో గ్రామంలో తీవ్ర విషాధచాయలు అలముకున్నాయి.

 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img