Thursday, September 19, 2024

త్వ‌రలో అందుబాటులోకి నాయిమ్ నగర్ బ్రిడ్జి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: దశబ్దాల కలగఉన్నటువంటి నయీమ్ నగర్ బ్రిడ్జి (పెద్ద మోరి ) పనులు చివరి దశకు చేరుకున్నాయని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం రోజు బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. రెండవ దశ పనులు పూర్తి కావచ్చాయని ఆగస్టు చివరికల్లా రవాణాకు సిద్ధంగా బ్రిడ్జి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికి రెండవ దశ బ్రిడ్జి పనులు కూడా పూర్తి కావచ్చాయని చివరి దశ బ్రిడ్జి పనులు పూర్థయినా క్రమంలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో నాణ్యత పరమైన ప్రమాణాలను పాటిస్తూ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. చిరకాల కోరికగా ఉన్న పెద్దమోరి నిర్మాణం ద్వారా ప్రధాన రహదారికి మరియు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలుగుతున్నాయని ఎమ్మెల్యే గారు ఆశభావం వ్యక్తం చేశారు. తెలీకపాటి వర్షాలకు సైతం కూరుకుపోతున్న పెద్ద మోరి వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కోతలకు గురైన ప్రదేశాలను మరియు అక్రమా నిర్మాణాలను కూల్చివేత‌పనులు జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి ఎంతటి వర్షభావ పరిస్థితి ఉన్నాకూడా ప్రజా రావాణకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img