Saturday, July 27, 2024

తూర్పు కాంగ్రెస్‌లో న‌యా జోష్‌

Must Read

నియోజ‌క‌వ‌ర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర‌కు అపూర్వ స్పంద‌న‌
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేప‌ట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వర్గంలో అపూర్వ స్పంద‌న ల‌భించింది. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, వ‌రంగ‌ల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ‌, మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళి ఆధ్వ‌ర్యంలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు రేవంత్‌కు నీరాజ‌నం ప‌లికారు. దారిపొడువునా ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. నిన్న వ‌రంగ‌ల్ ప‌శ్చిమ లో చేప‌ట్టిన పాద‌యాత్ర‌, స‌భ విజ‌య‌వంతం అవ‌డం, ఇవాళ వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్లో చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ల‌క‌డంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూత‌నోత్సాహం తొణికిస‌లాడుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img