Monday, September 16, 2024

ప్రజల ఫిర్యాదులను  వెంటనే పరిష్కరించాలి-ఎస్పి కిరణ్ ఖరే IPS

Must Read

అక్షరశక్తి భూపాలపల్లి: ప్రజల ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరంగా పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే IPS అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ సమస్యలపై వచ్చిన 16 మంది నుంచి ఫిర్యాదు పత్రాలను ఎస్పీ గారు స్వీకరించారు. ప్రతి పిర్యాదుపై విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చర్యలు చేపట్టాలని, ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు.
భూ తగాదాలు,ఆస్థి తగాదాల విషయంలో చట్ట ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని సూచించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే అసాంఘిక శక్తులు, నేరస్థుల పట్ల కఠిన వైఖరి అవలంభిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img