Sunday, September 8, 2024

రేవంత్ రెడ్డి యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన

Must Read

👉కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం
👉త్వరలో ఇబ్రహీంపట్నం లో కూడా రేవంత్ రెడ్డి యాత్ర
👉 కాంగ్రెస్ నేత చిలుక మధుసూదన్ రెడ్డి
అక్షరశక్తి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడోయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు.*రేవంత్ రెడ్డి యాత్రలో భాగంగా ఆయనతో నడుస్తున్న మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ*…. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబపాలన కొనసాగిస్తూ అవినీతి రాజ్యమేలుతున్న కేసీఆర్ ను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. గ్రామాలలో ప్రజలు కేసీఆర్ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారని, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు టిఆర్ఎస్ పాలన పట్ల అసంతృప్తిగా ఉన్నారని, కేవలం మాటలు చెబుతూ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి యాత్ర అధికార పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుందని అన్నారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర జరుగుతుందని, *త్వరలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి యాత్ర ఉంటుందని తెలియజేశారు. ఈ యాత్రలో చిలుక మధుసూదన్ రెడ్డి తో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు శివకుమార్ సతీష్ గౌడ్ ప్రవీణ్ వెంకట్ కిరణ్ గణేష్ శ్రీశైలం తదితరులు ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img