ఒడిశా: ఒడిశాలోని నయాగర్ జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేసి, అతడి నుంచి 3.1కిలోల బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే.. ఆ నిందితుడి నుంచి రూ.65.32లక్షలు, 3 పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు.