– బీజేపీ 33వ డివిజన్ అధ్యక్షుడు రాజీనామా
– ఎమ్మెల్యే నరేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
అక్షరశక్తి, వరంగల్ తూర్పు : ఎన్నికలవేళ వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమళ్ళ అరుణ సుధాకర్ ఆధ్వర్యంలో బీజేపీ 33వ డివిజన్ అధ్యక్షుడు చిలువేరు రాజేందర్, ఆయన అనుచర బృందం దుస్స శివ, తాటిపాముల భిక్షపతి, రాజు అనిల్ తో పాటు సుమారు 50కుటుంబాలు నేడు బిజెపి పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం కరీమాబాదులో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన నాయకులు మాట్లాడుతూ… తెలంగాణ పట్ల బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు నచ్చక వరంగల్ తూర్పు నియోజకవర్గం బిజెపి నాయకులను నమ్మే పరిస్థితి లేక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వన ఎమ్మెల్యే నరేందర్ చేసిన అభివృద్ధికి ఆకర్షితులమై బీఆర్ఎస్లో చేరామని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కొత్త పాత భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తో పాటు వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు,కుడా డైరెక్టర్,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.