Saturday, July 27, 2024

ప‌ర‌కాల‌లో ప్ర‌లోభాల ప‌ర్వం ?

Must Read
  • ఓట‌ర్ల‌కు పంచేందుకు కుట్టుమిష‌న్లు..
  • వ‌రికోల్‌లోని ఓ భ‌వ‌నంలో డంపింగ్
  • బ‌య‌టికొచ్చిన ఫోటోలు..
  • అధికార పార్టీవేన‌ని జోరుగా ప్ర‌చారం
    అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప్ర‌లోభాల ప‌ర్వానికి తెర‌లేసింది. పోలింగ్ తేదీ నాటికి ఓట‌ర్ల‌కు ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఆయా పార్టీలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ప‌ర‌కాల‌ నియోజ‌క‌వ‌ర్గంలోని న‌డికూడ మండ‌లం వ‌రికోల్ గ్రామంలోని ఓ ప్ర‌భుత్వ భ‌వ‌నంలో పెద్ద సంఖ్య‌లో డంపింగ్ చేసిన కుట్టు మిష‌న్ల ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ప్ర‌భుత్వ భ‌వ‌నంలో డంపింగ్ చేయ‌డంతో అవి అధికార పార్టీవేన‌న్న అనుమానాలు క‌లుగుతున్నాయి. ఓట‌ర్లకు ఇవ్వ‌డం కోస‌మే వీటిని వాహ‌నంలో త‌ర‌లించి ఇక్క‌డ భ‌ద్ర‌ప‌ర్చార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. కాగా, ఈ భ‌వ‌నంలో మొన్న‌టి వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు కుట్టుశిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హించిన‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే శిక్ష‌ణ పొందిన వారికి మిష‌న్లు ఇచ్చేందుకు డంపింగ్ చేసిన‌ట్లు సమాచారం. అయితే, ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో డంపింగ్ చేయ‌డంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. శిక్ష‌ణ పొందిన‌వారి సంఖ్య క‌న్నా.. అధిక‌మొత్తంలో కుట్టు విష‌న్లు ఉన్నాయ‌ని, వాటిని మ‌హిళా ఓట‌ర్ల‌కు ఇవ్వ‌డానికే తెచ్చార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img