అక్షరశక్తి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మేడ్చల్ నియోజకవర్గంలో ఆర్పీఐ(అథవాలె) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గడ్డి రవికుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలుకు ముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గడ్డి రవికుమార్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గంలో ఆర్పీఐ( అథవాలె) సత్తా చాటుతామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల హక్కులు, సంక్షేమం కోసం పోరాడుతున్న ఆర్పీఐకి ప్రజల మద్దతు ఉంటుందని, తనను ఆదరించి గెలిపించాలని పిలుపునిచ్చారు.