Saturday, July 27, 2024

రేగొండ‌లో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ‌

Must Read

కాంగ్రెస్‌లో 500మంది చేరిక‌

అక్ష‌ర‌శ‌క్తి, రేగొండ : భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు అత్యంత ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావు స‌మ‌క్షంలో జోరుగా చేరిక‌లు కొన‌సాగుతున్నాయి. తాజాగా, రేగొండ మండ‌లంలో బీఆర్ఎస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. రేగొండ మండ‌ల కేంద్రంలో శ‌నివారం ఏర్పాటు చేసిన స‌మావేశంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 500మంది నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో తిరుమలగిరి గ్రామానికి చెందిన ఎంపీటీసీ గంట గోపాల్, జూబ్లీనగర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్, దామరాంచపల్లి గ్రామానికి చెందిన సింగిల్ విండో డైరెక్టర్ మధుసూదన్ త‌దిత‌ర కీల‌క నాయ‌కులు ఉన్నారు. ఈ స‌మావేశంలో ఎమ్మెల్యే అభ్య‌ర్థి గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలోనే అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు. నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ.. క‌ష్ట‌సుఖాల్లో పాలుపంచుకుంటున్న త‌న‌ను ఆద‌రించి, భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరాఉ. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ‌య్య‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన ఆరు గ్యారంటీల‌తో ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని, అధికారంలోకి రాగానే అమ‌లు చేసి తీరుతామ‌ని అన్నారు. ఈ ఎన్నిక‌ల్లో భూపాల‌ప‌ల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావును భారీ మెజార్టీతో గెలిపించాల‌ని పిలుపునిచ్చారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img