అక్షరశక్తి, హన్మకొండ: తన పాటతో ప్రజలను చైతన్యపరుస్తున్న పోలీస్ కళాకారుడు, కాజీపేట ట్రాఫిక్ ఎస్సై రావెళ్ల రామారావును హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సన్మానించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగంపై పాట ద్వారా అవగాహన కల్పించేందుకు జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో ప్రొటెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న సౌరం ప్రవీణ్ కుమార్ (కళాశ్రీ) రాసిన ప్రజాస్వామ్య మనుగడకు ఓటు ఆయుధం పాటను కాజీపేట పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రావెళ్ళ రామారావు స్వర కల్పన గానం చేశారు. కాగా గురువారం కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత పాట సీడీని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… సమాజంలో నెలకొన్న సామాజిక సమస్యల పరిష్కారం కోసం రచనల ద్వారా మార్పు తీ సుకురావాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో రాసిన పాటను ప్రజల్లోకి చేరేలా, ఓటు శాతాన్ని పెంచేందుకు పలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజా చైతన్యం కల్పించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గీత రచయిత సౌరం ప్రవీణ్ కుమార్ (కళాశ్రీ), గాయకుడు రావెళ్ళ రామారావు, సంగీత ద ర్శకుడు ఎస్ వరుణ్ నజరాయ్ను అభినందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, జిల్లా ఎన్నికల నోడల్ అధికారి హరి ప్రసాద్, పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు లక్ష్మణ్ కుమార్, ఐఅండ్పీఆర్ డీఈ భూపాల్, జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పీ సంతోష్ కుమార్, డీ నగేష్, సంగి చైతన్య తదితరులు పాల్గొన్నారు.
Must Read