Friday, July 26, 2024

భూపాల‌ప‌ల్లి జిల్లాలో తీవ్ర విషాదం

Must Read

పిడుగుపాటుకు ముగ్గురు దుర్మ‌ర‌ణం
అక్ష‌ర‌శ‌క్తి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో త‌వ్ర విషాదం నెలకొంది. మంగళవారం కురిసిన వర్షానికి పిడుగులు పడడంతో ఒక రైతు, ఇద్దరు కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కాటారం మం డలం దామెరకుంటలో రాజేశ్వర్ రావు అనే రైతు పొలంగా కలుపు తీస్తున్నాడు. ఈ క్రమంలో పిడుగు పడడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. చిట్యాల మండల కైలాపూర్ వద్ద పిడుగుపాటుతో ఇద్దరు మహిళ కూలీల మృతి చెందారు. గ్రామానికి చెందిన చెలివేరు సరిత (30), నెరిపటి మమత (32) మిరప నారు పెడుతుండంగా పిడుగు పడింది. దీంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇటీవలే కురిసిన వర్షాలకు జిల్లాలోని మోరంచపల్లి వరదల్లో చిక్కుకొని నలుగురు మృతి చెందిన ఘటన మరువకముందే.. తాజాగా కురుస్తున్న వర్షంతో పిడుగుపడి ముగ్గురు మృతి చెందండంతో తీవ్ర విషాదం నెలకొంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img