Saturday, September 7, 2024

వ‌రంగ‌ల్ నుంచి షిరిడికి బ‌స్సు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : తెలంగాణ పర్యాటక శాఖ -తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ప్యాకేజ్ టూర్లలో భాగంగా వరంగల్ నగరం నుంచి 27-04-22 నుంచి ప్రతి బుధవారం, శనివారం వరంగల్ నుండి శిరిడి టూర్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12-30. గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి బ‌స్సు బయలుదేరి వయా బాసర షిరిడీ చేరుకుని నైట్ అక్క‌డే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు బయలుదేరి శనిసింగానాపురము, దత్తాత్రేయమందిరము (దేవగడ్ గ్రామము), గృషనేశ్వర్ జ్యోతిర్లింగం, ఎల్లోరాగుహలు, భద్రమారుతీ ఆంజనేయ దేవాలయం దర్శించుకుని మరుసటి రోజు ఉదయం 8 గంటలకు హనుమకొండ లోని హరిత కాకతీయ హోటల్ కు చేరుకుంటుంది. బుకింగ్ వివరాలకు శ్రీగిరి ట్రావెల్స్ ను ప్ర‌హ‌ల్ల‌ద‌రావు 9396755566, సూర్య‌కిర‌ణ్ 9849338854ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img