అక్షరశక్తి వరంగల్: శిశువుకు తల్లిపాలే రక్ష అని, తల్లి పాల వారోత్సవాల గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో ఈ నెల 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాల గోడ ప్రతులను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం తల్లిపాల వారోత్సవాలలోని ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా జిల్లాలో నిర్వహించాలని సూచించారు. మండల స్థాయిలో వైద్యశాఖ అధికారులు, ఐసీడీఎస్, మహిళ సంఘాల ద్వారా సంయుక్తంగా సమావేశం నిర్వహించి తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల ప్రణాళిక రూపొందించుకోని గ్రామాల వారిగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా సంక్షేమ అధికారి హైమావతి, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ, ఆర్డీఓ కృష్ణవేణి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.