మహబూబాబాద్ లో సోమవారం రాత్రి డిప్యూటీ తహసిల్దార్ డోలి సంధ్య (28) తమ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందగానే ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. సంధ్య ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
