అక్షరశక్తి ఆంద్రప్రదేశ్: జబర్దస్త్ యాక్టర్ కిరాక్ ఆర్పి ఎప్పుడు ఒక సెన్సేషనల్ న్యుస్ గానే నిలుస్తూ ఉంటాడు. అదేవిదంగా, ఇటీవల ఓ ప్రెస్ మీట్ పెట్టి. నాకు ఉన్న ఇంటలిజెన్స్ సమాచారం ప్రకారం రాష్ట్రం లో గొడవలు సృష్టించడానికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బీహార్ నుంచి వేల మంది గూండాలను ఆంధ్రప్రదేశ్లో దింపాలని చూస్తున్నారు, అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ని రావణ కాష్టంగా చేయాలని చూస్తున్నాడు. ఉన్నఫలంగా మధ్యంతర ఎన్నికలు ఏర్పాటు చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? దానికి గల కారణం ఏంటి? ఎందుకని అవిశ్వాస తర్మానం పెట్టబోతున్నారు? అంటూ ఫైర్ అయ్యాడు. రషీద్ హత్య కేవలం వాళ్ల కుటుంబ పరమైన గొడవల వల్లనే జరిగింది. రషీద్ వైసిపి పార్టీకి చెందిన కార్యకర్త, వైసిపి నాయకులతో దిగిన ఫొటోస్ ఎన్నో సోషల్ మీడియాలో ఉన్నాయి. అంటూ కామెంట్ చేశారు.