Thursday, September 19, 2024

పాఠశాలకు సౌండ్ సిస్టం బహూకరణ

Must Read

అక్షరశక్తి, కొత్త గూడ: ఎదుళ్లపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి ఇటీవల పదోన్నతులు, బదిలీలో వెళ్లిన ఉపాధ్యాయులు డబ్బగట్ల శ్రీదేవి, మల్కం వీరస్వామి, మద్దెల సూరయ్య, ఈసాల లక్ష్మయ్య, శ్రీలత, మేడ సుజాతలు 12 వెలు రూపాయల విలువ గల సౌండ్ సిస్టం పాఠశాలకు ప్రధానం చేశారు. అలాగే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పేద విద్యార్థి అనుముల ఎలెందర్ కు స్టడీ మెటీరియల్ ఉపాధ్యాయుడు ఈసాల లక్ష్మయ్య అందజేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడే సేవా దృక్పధం కలిగిన సదరు ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు గుమ్మడి లక్ష్మీనారాయణ ఆధ్యర్యంలో చిరుసత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయబృందం యం. డి. మస్తాన్, ధనుసరి అంజయ్య, బత్తిని వెంకటేశ్వర్లు, నాంపల్లి, కృష్ణ మోహన్, గట్టు వేణు, ఇర్ప ఎలెంద్ర, పెనక రామస్వామి పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img