అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిఐల సస్పెన్షన్ల పరంపర కొనసాగుతూనే ఉంది. విధుల నిర్వహణలో నియమ నిబంధనలు పాటించకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతూ పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకొస్తున్న వారిపై సిపి ఏవీ రంగనాథ్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా.. కే.యూ.సి ఇన్స్పెక్టర్ దయాకర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భూ వివాదంలో కేసు నమోదు చేయకుండా ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకపోగా భాదితులను పలుమార్లు స్టేషన్ కు తిప్పిస్తూ తన *ప్రోత్సాహంతో బయటి వ్యక్తులతో సెటిల్మెంట్ ప్రయత్నిస్తున్నందుకు కె. యూ.సి ఇన్స్ స్పెక్టర్* *దయాకర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేసారు.