అక్షరశక్తి ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు సూచించాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి కొన్ని అవాంఛనీయ గ్రూపులలో ప్రస్తావన వచ్చిందని, వాటి వలన పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉందని, కేంద్ర నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందులో భాగంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని అప్రమత్తంగా ఉండాలని, సమాచారం ఇచ్చాయి. ఆ గ్రూపులకు సంబంధించిన విషయాలను ప్రస్తుతం గోప్యంగా ఉంచుతామని, త్వరలో అన్ని వివరాలను ఆధారాలతో సహా బయట పెడతామని, చెప్పుకొచ్చాయి.