తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి. హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్లోని గోల్డెన్ జూబ్లీ హాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు మే 10 నుంచి మే 14 వరకు జరిగాయి. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,275 మంది విద్యార్థులు, అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు....