Saturday, July 27, 2024

భద్రకాళి చెరువులో బోటు షికార్‌

Must Read
  • త్వ‌ర‌లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు
    అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : తెలంగాణా పర్యాటక అభివృద్ధి సంస్థ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళీ చెరువులో బోట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జెట్టి భద్రకాళీ బండ్‌లోకి చేరుకుంది. హైదరాబాద్ నుండి వచ్చిన జెట్టి ఈ రోజు భద్రకాళి బండ్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. మరో వారం రోజుల్లో 25మంది ప్ర‌యాణించే బోటు షికారు ప్రారంభం అవుతుందని జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజి తెలిపారు. ఎన్నో సంవత్సారాలుగా నగర వాసులు ఎదురు చూస్తున్న బోటు షికారు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం అవుతుంది. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఇప్పటికే భద్రకాళి బండ్ ను అద్భుతంగా తీర్చి దిద్దింది. ఇకపై బోటు షికారు వల్ల నగర ప్రజలకు వారాంతంలో మంచి అనుభూతి కలుగుతుందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img