Saturday, July 27, 2024

రామ‌న్న హ‌ల్‌చ‌ల్‌..!

Must Read
  • ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌
  • రూ. 184.53 కోట్ల ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు
    అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం మహానగర పాలక సంస్థ, ఇతర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు రూ. 184.53 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభో త్సవాలు, శంకుస్థాపనలు చేశారు. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి, సీఎంఏ, మునిసిపల్ సాధారణ నిధులు, స్మార్ట్ సిటీ, స్టేట్ గ్రాంట్ ఫండ్ పథకాల కింద‌ రూ. 27.63 కోట్లతో చేపట్టిన 6 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, రూ. 157.90 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 14 అభివృద్ధి కార్యక్రమాల పనులకు శంకుస్థాపనలు చేశారు.

ప్రారంభోత్స‌వాలు..

రూ. 7 కోట్ల వ్యయంతో భద్రకాళి దేవాలయ కమాన్ నుంచి జీడబ్ల్యూఎంసీ కార్యాలయం వరకు నిర్మించిన ఆర్ 4 రోడ్డును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 7 కోట్లతో అలంకార్ దర్గా బ్రిడ్జ్ నుంచి రోడ్ నెం. 2 వరకు నిర్మించిన స్మార్ట్ రోడ్ ఆర్ 3 ను, రూ. 11.50 కోట్లతో అభివృద్ధి చేసిన పబ్లిక్ గార్డెన్స్, 1.5 కోట్ల రూపాయల వ్యయంతో నవీకరించిన ప్రాంతీయ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. రూ. 27 లక్షలతో కొనుగోలు చేసిన రెండు వైకుంఠ రథాలను, 36 లక్షలతో కొనుగోలు చేసిన 66 ఫాగింగ్ మెషిన్ల‌ను మంత్రి ప్రారంభించారు.

శంకుస్థాప‌న‌లు..

రూ. 8 కోట్లతో ఏర్పాటు చేయనున్న 150 కేఎల్‌డి, ఎఫ్‌ఎస్‌పీపీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ. 20.50 కోట్లతో నిర్మించనున్న మహానగర పాలక సంస్థ పరిపాలనా భవనానికి, రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కౌన్సిల్‌హాల్‌కు, రూ. 2 కోట్లతో విద్యుత్‌నగర్‌లో నిర్మించనున్న దివ్యాంగుల శిక్షణ కేంద్రానికి, రూ 9 కోట్లతో 37 ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి, రూ. 1.50 కోట్లతో పోతన వైకుంఠధామం అభివృద్ధికి శంకుస్థాప‌న చేశారు. రూ. 22 కోట్లతో నయీంనగర్ నుండి ప్రెస్టీన్ స్కూల్ వరకు రిటైనింగ్ వాల్ ఏర్పాటుకు, రూ. 15 కోట్లతో నాలల మీద కల్వర్టుల నిర్మాణానికి, జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో రూ. 71 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాప‌న చేశారు. రూ. 2.50 కోట్లతో కాజీపేట నుంచి పెద్దమ్మగడ్డ వరకు ఆర్సీసీ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి, రూ. 70 లక్షలతో కాకతీయ మ్యూజికల్ గార్డెన్‌లో ఏర్పాటు చేయనున్న జాతీయ జెండాకు, జీడబ్ల్యూఎంసీ ఆవరణలో రూ. 4 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లకు కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు.

అదేవిధంగా రూ.3.10 కోట్లతో హన్మకొండ లో నిర్మించనున్న తెలంగాణ హస్తకళ విక్రయశాల భవనానికి, రూ. 3.6 కోట్లతో ఎన్పీడీసీఎల్ ఆధ్వ‌ర్యంలో మచిలిబజార్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్‌కు, జీడబ్ల్యూఎంసీ కార్యాలయం వద్ద మంత్రి కేటీఆర్ ఒకే చోట మొత్తం 14 శంకుస్థాపనలను చేశారు.

కార్యక్రమాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, ప‌శ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, వ‌రంగ‌ల్ ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌, వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్‌, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, జెడ్పీ చైర్మన్లు డాక్టర్ సుధీర్‌కుమార్, గండ్ర జ్యోతి, కుసుమ జగదీష్, పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మరెడ్డి, తాటికొండ రాజయ్య, రాష్ట్ర మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామ అయ్యర్, సీడీఎంఏ డాక్టర్ సత్యనారాయణ, సీపీ డాక్టర్ తరుణ్ జోషి, జిల్లా కలెక్టర్ డాక్టర్ పీ గోపి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాద‌వ్‌, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ మేయర్ రిజ్వాన ష‌మీం మసూద్, కార్పొరేటర్లు, రెవెన్యూ, బల్దియా, పబ్లిక్ హెల్త్, ఎన్పీడీసీఎల్ ఉన్నతస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img