Thursday, September 19, 2024

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

Must Read
  • పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు

అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల స్వర్ణోత్సవ సభ, అక్టోబర్ 1న ఆల్ ఇండియా పీడీఎస్‌యూ ఆవిర్భావ సభలకు విద్యార్థిలోకం అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు పిలుపునిచ్చారు. గురువారం కాకతీయ యూనివర్సిటీలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) ఆధ్వర్యంలో “50 వసంతాల స్వర్ణోత్సవ సభల వాల్ పోస్టర్స్” ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బి. నరసింహారావు మాట్లాడుతూ గత 50 ఏళ్ల నుండి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థుల హక్కుల కోసం ,శాస్త్రీయ విద్య, సమసమాజ స్థాపన ధ్యేయంగా పి.డి.ఎస్.యు. ఉద్యమించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. కాకతీయ యూనివర్సిటీ నాయకులు అశోక్, సంగీత, అనూష, స్వాతి, నరేష్, పృథ్వీ, అజహార్, రమేష్, వీరేందర్, రాజు, సునీల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img