Thursday, September 19, 2024

అమరవీరుల త్యాగాలు యువతకు స్ఫూర్తి – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

Must Read

అక్షరశక్తి భూపాలపల్లి: దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని దేశానికి సేవలు అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం రోజున భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంట్రన్స్ గేటు వద్ద ఉన్న అమర జవాను స్థూపం వద్ద మాజీ సైనికుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి హాజరయ్యారు. అమర జవాన్ స్తూపం వద్ద పుష్పగుచ్చం పెట్టి ఎమ్మెల్యే ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. కార్గిల్ యుద్దాన్ని మన దేశం గెలిచి పాతిక సంవత్సరాల అవుతుందని అన్నారు. యుద్ధంలో మన సైనికులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సీఐ దొమ్మాటి నరేష్ కుమార్ మరియు పట్టణ కాంగ్రెస్ నేతలు ఇస్లావత్ దేవన్, కురిమిళ్ళ శ్రీనివాస్, అజ్మీరా తిరుపతి నాయక్, పిప్పల రాజేందర్, బుర్ర కొమురయ్య, ముంజాల రవి, తాటి అశోక్, పొనగంటి శ్రీనివాస్, గన్నరపు రమేష్, వెంకి యాదవ్ , సంతోష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img