అక్షరశక్తి శాయంపేట: భూపాలపల్లి నియోజకవర్గ పరిధి శాయంపేట మండలంలోని గట్ల కనుపర్తి గ్రామంలో భక్తులతో పాటు పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో ఉన్న మహంకాళి దేవాలయంలో ఆదివారం బోనాల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాయకులు గ్రామస్తులు ఎమ్మెల్యే గారిని శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపల బుచ్చిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షలు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.