అక్షరశక్తి వనపర్తి: ప్రైవేట్ ఆస్పత్రుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణం తీసింది. శ్రీరంగపూర్ మండలం నాగసానిపల్లి గ్రామానికి చెందిన పుష్పలత(22) 4 నెలల గర్భిణి.. కడుపులో నొప్పి వస్తుందని పెబ్బేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఆస్పత్రిలో డాక్టర్ అందుబాటులో లేకపోయినా నర్సులు అడ్మిట్ చేసుకొని డాక్టర్తో ఫోన్లో మాట్లాడుతూ, మెసేజ్లు చేస్తూ గర్భిణీకి ట్రీట్మెంట్ చేశారు.. నర్సులకు ట్రీట్మెంట్ చేయడం రాక పుష్పలత గర్భసంచి బ్లాస్ట్ అయి గర్భిణీ మృతి చెందింది. ఈ ఘటనతో స్తానికంగా విషాదం నెలకొంది. ఈ పరిస్థితికి కారణమైన ప్రైవేట్ ఆస్పత్రి పై చర్యలు తిసుకోవాలని స్తానికులు డిమాండ్ చేసారు.